Mar 30, 2024, 08:03 IST/పెద్దపల్లి
పెద్దపల్లి
కాలువ నీటిని పొదుపుగా వాడుకోవాలి
Mar 30, 2024, 08:03 IST
రైతులు కాలువ నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి సూచించారు. శనివారం ఓదెల మండలం కనగర్తిలో ఎండిపోతున్న వరి పంటలను డీఏఓ పరిశీలించారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని, ఇంకో 2, 3 తడులకు బావుల నీటిని అందిస్తూ. తోటి రైతుల సహకారంతో పంటలను కాపాడుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో ఏఓ నాగార్జున, ఏఈఓ సతీష్, రైతులు సమ్మయ్య, మణికంఠలు పాల్గొన్నారు.