నకరికల్లులో సామూహిక రాహు కేతు పూజలు

84చూసినవారు
నకరికల్లు మండలం నరసింగపాడులో కొలువైన అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరస్వామి దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఆలయంలో ఆషాఢ మాసం, ఆదివారం అమావాస్య సందర్భంగా సామూహిక రాహు, కేతు పూజలు చేశారు. ఈ పూజలో దంపతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం పూజారి మాట్లాడుతూ. రాహు కేతు పూజల వలన కాలసర్ప, కుజ దోషాలు తొలగి సంపూర్ణ నవగ్రహ శాంతి కలుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్