తుళ్లూరులో మహిళ అదృశ్యంపై కేసు నమోదు

85చూసినవారు
తుళ్లూరులో మహిళ అదృశ్యంపై కేసు నమోదు
మహిళ అదృశ్యంపై తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం మందడం గ్రామానికి చెందిన నరసింహారావు భార్య రూతమ్మతో కొద్ది రోజుల కిందట వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో రూతమ్మ ఇంటి నుంచి వెళ్లి పోయింది. కుటుంబ సభ్యులు బంధువులు ఇళ్ల వద్ద, చుట్టు పక్కల ఎక్కడ వెతికిన కనిపించకపోవడంతో నరసింహారావు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్