రైతుల అనుమానాలు తీరుస్తున్నా: మంత్రి నారాయణ

67చూసినవారు
భూములు ఇచ్చే రైతుల ఇంటికి స్వయంగా వెళ్లి వారి అనుమానాలు తీరుస్తున్నానని మంత్రి నారాయణ అన్నారు. సోమవారం రాత్రి ఆయన తాడేపల్లి మండలం పెనుమాకలో స్వయంగా రైతుల ఇళ్ళ వద్దకు వెళ్లి అంగీకార పత్రాలు స్వీకరించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పెనుమాకలో ఆరుగురు రైతులు 7.2 ఎకరాల భూమిని ఇచ్చారని చెప్పారు. 2015లో కేవలం 58 రోజుల్లోనే 34 వేల ఎకరాలు భూమిని రైతులు ల్యాండ్ పూలింగ్ కు ఇచ్చారని తెలిపారు.

సంబంధిత పోస్ట్