3 లక్షలు విలువ చేసే అక్రమ మద్యం స్వాధీనం

1620చూసినవారు
3 లక్షలు విలువ చేసే అక్రమ మద్యం స్వాధీనం
మండలంలోని పొనుగోటివారిపాలెం వద్ద ఈపూరు పోలీసులు భారీగా తెలంగాణ మధ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన శ్రీనివాస రావు ద్విచక్ర వాహనం పై సంచుల్లో మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా, సమాచారం మేరకు ఈపూరు ఎస్సై ఇప్పట్ల వెంకట్రావు ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు నిర్వహించి శ్రీనివాస రావును అదుపులోకి తీసుకొని విచారించగా, దాచిన మద్యం నిల్వలను ఆచూకీ చెప్పడంతో 3 లక్షల విలువచేసే 1098 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. మద్యం బాటిల్ విలువ సుమారు మూడు లక్షలు ఉంటుందని వివరించారు. భారీ మొత్తంలో మద్యం నిల్వలు చేసిన శ్రీనివాస రావును అరెస్టు చేసి మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తనిఖీల్లో విలేజ్ పోలీస్ సుబ్బారావు, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్