వినుకొండ - Vinukonda

ప్రజాగళం సభకు వెళ్లినందుకు కుళాయి కనెక్షన్‌ కట్ చేసిన వైసిపి నేతలు

ప్రజాగళం సభకు వెళ్లినందుకు కుళాయి కనెక్షన్‌ కట్ చేసిన వైసిపి నేతలు

చిలకలూరిపేట లోని బొప్పూడిలో ఈ నెల 17న జరిగిన టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రజాగళం బహిరంగ సభకు నూజెండ్ల మండలం తెల్లపాడు గ్రామం రజక కాలనీకి చెందిన పగడాల రాముడు సుశీల వెళ్లారు. అప్పటినుండి కక్ష పెంచుకున్న గ్రామంలోని వైసిపి నాయకులు బీసీలు అని కూడా చూడకుండా పంచాయతీ కుళాయిను కట్ చేశారు. దీంతో రాముడు కుటుంబం నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే ఎండాకాలం అందులోనూ పంచాయతీ నీళ్ళు కట్ చేయడంతో తాగేందుకు గుక్కెడు మంచి నీళ్లు కూడా లేక నరకం అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వీడియోలు


పెద్దపల్లి జిల్లా