వరద బాధితుల కోసం వైసీపీ నేతల భారీ విరాళం

75చూసినవారు
వరద బాధితుల కోసం వైసీపీ నేతల భారీ విరాళం
వరద బాధితుల కోసం వైసీపీ నేతలు భారీ విరాళం ప్రకటించారు. వైయస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెల జీతం విరాళం ప్రకటించారు. విజయవాడ వరద బాధితుల కోసం వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మరిన్ని అడుగులు ముందుకేసింది.పార్టీ తరఫున ఇదివరకే కోటి రూపాయల సహాయాన్ని జగన్‌ ప్రకటించారు. దాన్ని వినియోగించి వరద బాధితుల కోసం పాల ప్యాకెట్లు, వాటర్‌ బాటిళ్లు పెద్ద ఎత్తున పంపిణీ చేశారు. ఇంకా బాధితుల అవసరాలు గుర్తించి, సరుకులు పంపిణీ చేస్తామని పార్టీ ప్రకటించింది.

సంబంధిత పోస్ట్