కాంగ్రెస్ మేనిఫెస్టోపై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. యూపీ సహరన్పూర్లో శనివారం జరిగిన బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు.
ఇండియా కూటమి కమీషన్ల కోసమే అధికారం కోరుకుంటోందని మోడీ మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం ఓ మిషన్ కోసం పనిచేస్తోందని చెప్పారు. ముస్లిం లీగ్, వామపక్ష భావజాలం కలిగిన వారి ముద్ర మేనిఫెస్టోలో కనిపిస్తోందన్నారు. అనిశ్చితి, అస్థిరతకు పర్యాయపదంగా
ఇండియా కూటమి తయారైందని ఎద్దేవా చేశారు.