ప్రభుత్వ సెక్యూరిటీస్ (జి-సెక్యూరిటీస్) లేదా ప్రభుత్వ బాండ్ల మార్కెట్లలో రిటైల్ మదుపర్లు కూడా పాల్గొనేలా వీలు కల్పించేందుకు ఒక మొబైల్ యాప్ను త్వరలోనే ఆర్బీఐ అందుబాటులోకి తేనుంది. ఈ యాప్ ద్వారా బాండ్ల కొనుగోలు, విక్రయాలను నిర్వహించవచ్చు. మరో వైపు, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్(ఐఎఫ్ఎస్సీ)లో సావరిన్ గ్రీన్ బ్రాండ్ల ట్రేడింగ్కు ఆర్బీఐ అనుమతినిచ్చింది.