అమిత్ షా ఫోన్ చేస్తే ఒకటే చెప్పా: చంద్రబాబు

570చూసినవారు
అమిత్ షా ఫోన్ చేస్తే ఒకటే చెప్పా: చంద్రబాబు
లోక్‌సభ స్పీకర్ ఎంపికపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనకు ఫోన్ చేశాడని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే, ఆ విషయం టీడీపీకి సంబంధం లేదని తాను స్పష్టం చేశానన్నారు. కూటమిలో కీలక పార్టీగా ఉన్న టీడీపీకి పదవులతో సంబంధం లేదని, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని తేల్చి చెప్పారు. పదవుల కోసం పట్టుబడితే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని, ఈ విషయం ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలని టీడీపీ ఎంపీలకు చెప్పారు.

సంబంధిత పోస్ట్