క‌డ‌ప‌లో టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ

60చూసినవారు
క‌డ‌ప‌లో టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ
AP: కడప జిల్లాలో మ‌రోసారి ఉద్రిక్త‌ వాతావ‌ర‌ణం నెల‌కొంది. క‌డప జిల్లా యర్రగుంట్ల మండల పరిధిలో గుత్తి గ్రామంలో శనివారం అర్ధరాత్రి టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో వెంకట రాముడు అనే వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయ‌ప‌డిన వ్య‌క్తిని స్థానికులు ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాత కక్షల వల్లే ఈ ఘర్షణ చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకుని దర్యాప్తు చేప‌ట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్