ఏపీలో ఐదేళ్ల వైసీపీ పాలన తర్వాత మాజీ సీఎం జగన్ మరోసారి తన పార్టీని ఎన్నికల్లో గెలిపించుకోలేకపోయారు. దీనికి కారణాలు ఏవైనా తిరిగి పుంజుకునేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. త్వరలో జగన్ 2.0 ఉంటుందని కూడా చెప్పేశారు. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తిరిగి అధికారంలోకి రావడం కష్టమేనని తేల్చిచెప్పేశారు. ట్రంప్ కంటే, నాలుగింతలు ఎక్కువ ఆస్తి, డబ్బు జగన్ సంపాదించాడన్నారు.