ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్తో పోల్చుకుంటే ఢిల్లీలో జరిగింది చాలా చిన్నదని సీఎం చంద్రబాబు అన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. 'వైసీపీ పాలనలో ఏపీలో మద్యం మాఫియా తయారైంది. మద్యం కుంభకోణంలో వచ్చే డబ్బు పాపిష్టిది. మద్యం స్కామ్లో భాగమైన వారి కుటుంబాలు కూడా బాగుపడవు. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసి రూ.వేల కోట్లు దోచుకున్నారు.' అని సీఎం అన్నారు.