కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అత్యంత వివాదాస్పద ఎమ్మెల్యేగా ముద్రపడ్డారు తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు. ఎమ్మెల్యేగా వివాదస్పదమవుతున్న కొలికపూడి టాలెండెడ్ ప్రొఫెసర్. ఆయన రాజకీయ రంగ ప్రవేశం నాటకీయంగా జరిగింది. అమరావతి రాజధాని పరిరక్షణ కోసమంటూ ఉద్యమకారుడిగా హైదరాబాద్ నుంచి ఏకంగా 300 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అప్పట్లో సంచలనం సృష్టించారు. ఆ తర్వాత టీడీపీ దృష్టిలో పడి గత ఎన్నికల్లో తిరువూరు నుంచి పోటీ చేసి గెలుపొందారు.