AP: టీడీపీ మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి వైఎస్ జగన్పై కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నమయ్య జిల్లా అభివృద్ధిపై కలెక్టరేట్లో మంత్రి బి.సి. జనార్దన్రెడ్డి సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. 'జగన్ది విధ్వంస పాలన.. మాది అభివృద్ధి, సంక్షేమ పాలన అన్నారు. వైసీపీ హయాంలో పరిశ్రమలు తిరిగి వెళ్లిపోయాయి. అన్నమయ్య జిల్లాలో అభివృద్ధిని పరుగులు పెట్టించేలా చర్యలు తీసుకోవాలని' మంత్రి అధికారులను ఆదేశించారు.