ఏపీ రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా బి.సి. జనార్దన్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. టీడీపీ హయాంలో ఆర్అండ్బీ శాఖకు రూ.14,900 కోట్లు ఇచ్చారన్నారు. ఆర్అండ్బీ శాఖకు ఇచ్చిన దాంట్లో 80 శాతం ఖర్చు చేశామన్నారు. వైసీపీ ప్రభుత్వం మాత్రం 46 శాతమే ఖర్చు చేసిందన్నారు. ఎక్కడ చూసినా రోడ్లపై గుంతలు కనిపిస్తున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం గుత్తేదారులకు రూ.2,260 కోట్లు పెండింగ్ పెట్టిందని చెప్పారు.