దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 120 పాయింట్లు పెరిగి 23,841 వద్దకు చేరింది. సెన్సెక్స్ 518 పాయింట్లు ఎగబాకి 78,572 వద్ద ముగిసింది. రిలయర్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్టెల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, NTPC, సన్ ఫార్మా లాభపడ్డాయి. ఎం అండ్ ఎం, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, JSW స్టీల్ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.