ఏపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ .. రాజకీయాలు మాత్రం ఆయన్ను వదలడం లేదు. తాజాగా టీడీపీ సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి అభిమానులు పాలాభిషేకం చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. తాజాగా చిత్తూరు జిల్లాలో జరిగిన టీడీపీ ర్యాలీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలకు అభిమానులు పాలాభిషేకం చేశారు. అభిమానులు అక్కడితో ఆగకుండా టీడీపీ నేతల ముందే జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు.