కొండాపురం పట్టణంలోని శివసాయి హైస్కూల్ వెనుక ఆర్ అండ్ ఆర్ కాలనీలో నీటి బోరు రిపేరు ఉండడంతో నెలరోజుల నుండి నీటి సమస్యతో కాలనీవాసులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సందర్భంగా బిజెపి నాయకుడు పాత కొండాపురం శ్రీరామిరెడ్డి తన సొంత ఖర్చులతో రిపేరు చేయిస్తున్నారు. నెల రోజుల నుండి ఉన్న నీటి సమస్యపై పలుమార్లు అధికారులకు తెలపగా స్పందించకపోవడంతో ఆయన ముందుకు వచ్చి నీటి మోటారుకు మరమత్తులు చేయించారు.