గద్దలరేవుపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన సాయి కిషోర్
ఓబులవారి పల్లి మండలం గద్దలరేవు పల్లి, పాయలవారి పల్లి, హరిజనవాడ, గద్ధలరేవుపల్లి, ఎస్టీ కాలనీలలో శుక్రవారం ప్రభుత్వ పథకాల గురించి, నవరత్నాల గురించి మండల కన్వీనర్ వత్తలూరు సాయి కిషోర్ రెడ్డి ఇంటింటికీ తిరిగి వివరించారు. మరొకమారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి పార్లమెంటు సభ్యులుగా మిథున్ రెడ్డి, శాసన సభ్యులుగా కొరముట్ల శ్రీనివాసులుని గెలిపించాలని ఆయన కోరారు.