పింఛన్ల పంపిణీపై వైసీపీ రాద్దాంతం చేయడం సరికాదని పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి విమర్శించారు. పింఛన్ల పంపిణీకి టీడీపీ వ్యతిరేకం కాదని, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక పింఛన్ల పంపిణీ చేయడం లేదన్నారు. పింఛన్లకు సరిపడా డబ్బులు ఉంటే సచివాలయం సిబ్బంది ద్వారా సకాలంలో పంపిణీ చేయవచ్చని, వాటికి టీడీపీ కార్యకర్తల సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.