వాలంటీర్లపై ఎన్నికల సంఘానికి జై భారత్ నేషనల్ పార్టీ, లిబరేషన్ కాంగ్రెస్ నేతలు జేడీ లక్ష్మీనారాయణ, విజయ్కుమార్ ఫిర్యాదు చేశారు. వాలంటీర్లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మీడియాతో జేడీ మాట్లాడుతూ.. ఒక ప్రాంతానికి చెందిన వాలంటీర్లను వేరే ప్రాంతాలకు పంపాలన్నారు. వాలంటీర్లు స్థానికంగా ఉంటే ఎన్నికలు పారదర్శకంగా జరగవని పేర్కొన్నారు.