ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..!

13143చూసినవారు
ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..!
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కేంద్రంలో ఉన్న ఎన్డీయే సర్కార్ కూడా అన్ని విధాలా సహకరించేందుకు సిద్దమవుతోంది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలో స్టీల్ ప్లాంట్‌ను వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ పథకంలో భాగంగా ప్రైవేటీకరించేందుకు దూకుడుగా అడుగులు వేసిన కేంద్రం.. ఇప్పుడు రాష్ట్రంలో తమ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో ఆచితూచి స్పందిస్తోంది. ఈ క్రమంలోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో లేదని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.

సంబంధిత పోస్ట్