కేరళలోని కొట్టాయం కిటంగూర్ చర్చి యార్డ్లో ఆదివారం సాయంత్రం ఊహించని ప్రమాదం జరిగింది. సెయింట్ మేరీస్ చర్చి వద్ద ఓ వ్యక్తి నడిపిన కారు అదుపు తప్పింది. అక్కడే ఉన్న జనాలపైకి వేగంగా దూసుకెళ్లింది. పలువురిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి గాయపడ్డారు. ప్రమాదంలో ఓ చిన్నారి తృటిలో తప్పించుకుంది. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.