కాకినాడ నగరంలో అక్రమ కట్టడాలు తొలగింపు

81చూసినవారు
కాకినాడ నగరంలో సంత చెరువు వద్ద శ్రీ కనక దుర్గ అమ్మవారి దేవస్థానం ఆనుకుని అక్రమంగా నిర్మించిన మూడు షాపులను తొలగించినట్లు కాకినాడ కార్పొరేషన్ డిసిపి హరిదాసు పేర్కొన్నారు. సోమవారం ఉదయం పోలీస్ , టౌన్ ప్లానింగ్ అధికారుల సమక్షంలో అక్రమ కట్టడాలను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతుల మార్కెట్ ప్రాంతంలో 60 అడుగుల రోడ్డు విస్తరణ ఉందని రోడ్డుని ఆక్రమించుకుని షాపుల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్