అంతరాలయంలోకి చేరిన వర్షపు నీరు

68చూసినవారు
ఐ. పోలవరం మండలం గుత్తినదీవి గ్రామంలో దేవాలయం బుధవారం ముంపు బారిన పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో స్వయంభూ గౌతమ మహర్షిచే ప్రతిష్టించిన ఆంజనేయ స్వామి ఆలయ అంతరాలయంలోకి వర్షపు నీరు చేరింది. భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోన్నారు. వర్షపు నీటిని భక్తుల సహాయంతో అర్చకులు బయటకు తోడారు. వర్షపు నీరు ఆలయంలో ప్రవేశించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్