ఏలేరు కాలువను పరిశీలించిన సీఎం చంద్రబాబు

63చూసినవారు
ఏలేరు కాలువను పరిశీలించిన సీఎం చంద్రబాబు
పెద్దాపురం మండలం జి. రాగంపేట, వడ్లమూరి గ్రామాల సమీపంలోని ఏలేరు వరద కాలువను బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా సామర్లకోట నుంచి బస్సులో కిర్లంపూడికి బయలుదేరారు. ముందుగా వడ్లమూరు ఏలేరు కాలువ గండి ప్రాంతాన్ని రైతులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ షాన్మోహన్, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ముంపు బాధితుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

సంబంధిత పోస్ట్