అంబేద్కర్ పాట వేసినందుకు దాడి చేశారు

76చూసినవారు
డా. బి. ఆర్. అంబేద్కర్ పాట వేసినందుకు దళిత యువకులపై దాడి చేశారని పెడన మండలం చెన్నూరు పాత హరిజనవాడకు చెందిన మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ, పాత హరిజనవాడకు చెందిన యువకులు గణేష్ నిమజ్జనం సందర్భంగా అంబేద్కర్ పాట వేస్తే కొత్తపేటకు చెందిన కుర్రోళ్ళు దాడి చేశారని తెలిపారు. రాత్రంతా ఇక్కడే ఉండి నిరసన తెలిపినా అధికారులు పట్టించుకోలేదని తెలిపారు. మాకు న్యాయం చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్