వైసీపీ పాలనలో వ్యవస్థలు ధ్వంసమయ్యాయి: ఎమ్మెల్యే

63చూసినవారు
వైసీపీ పాలనలో వ్యవస్థలు ధ్వంసమయ్యాయని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శనివారం సాయంత్రం చల్లపల్లి గ్రామ పంచాయతీలో ఇది మంచి ప్రభుత్వం గ్రామసభ జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ పాలనలో గ్రామ సచివాలయ, గ్రామ వాలంటీర్, పోలీస్ వ్యవస్థలను పూర్తిగా ప్రతిపక్ష పార్టీలను అణచివేసేందుకే వినియోగించారన్నారు. తమ ప్రభుత్వం ప్రజలకు స్వేచ్ఛతో కూడిన పరిపాలన అందిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్