నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

80చూసినవారు
కృష్ణానది వరదల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు బొందలపాటి వరప్రసాద్ కోరారు. ఆదివారం మోపిదేవి వార్పు వద్ద వరదల కారణంగా ముంపుకు గురైన తన పొలంలో ఆయన తన ఆవేదన తెలిపారు. వార్పు దగ్గర కాలవకు గండి పడి పసుపు, కంద, బొప్పాయి, జామ పొలాలు నీట మునిగి అపార నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్