గన్నవరం: 150 కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు

57చూసినవారు
అక్రమంగా తరలిస్తున్న 150 కేజీల గంజాయిని పడమట సీఐ పవన్ కిషోర్ పట్టుకున్నారు. శుక్రవారం విజయవాడ రూరల్ మండలంలోని రామవరపాడు రింగు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తుల దగ్గర సుమారు 150 కిలోలు గంజాయిని సిఐ పవన్ కిషోర్ స్వాధీనం చేసుకున్నారు.విశాఖపట్నం నుండి చెన్నైకి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించి పక్కా సమాచారంతో పోలీసులు 150 కేజీల గంజాయిని పట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్