గన్నవరంలో స్తంభించిన ట్రాఫిక్

5777చూసినవారు
గన్నవరంలో గురువారం వైసిపి అభ్యర్థి వల్లభనేని వంశీ మోహన్ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ పర్వానికి ముందే భారీగా చేరుకున్న వైసిపి కార్యకర్తలు, సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. నియోజకవర్గం నాలుగు మండలాల నుంచి వైసిపి కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తు తరలివచ్చారు. గన్నవరం పట్టణంలో ప్రధాన రహదారులన్నీ స్తంభించాయి. రహదారులన్నీ వైసీపీ జెండాలతో నిండిపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్