బైక్‌ను తప్పించబోయి స్కూల్‌ ఆటో ప్రమాదవశాత్తు బోల్తా

14795చూసినవారు
బైక్‌ను తప్పించబోయి స్కూల్‌ ఆటో ప్రమాదవశాత్తు బోల్తా
ఇబ్రహీంపట్నం  మండలంలోని గుంటుపల్లి వద్ద హైవేపై మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓవిద్యార్థినీ మృతిచెందగా, మరో నలుగురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. పాఠశాల ముగిసిన అనంతరం 14మంది విద్యార్థులను ఎక్కించుకుని వెళ్తున్న ఆటో రాంగ్‌రూట్‌లో వచ్చిన బైక్‌ను తప్పించబోయి అదుపు తప్పి బోల్తాపడింది. ఈఘటనలో విద్యాధరపురం కామకోటినగర్‌కు చెందిన పరువాల ఆనంద్‌ కుమార్తె నవ్యశ్రీ(10) మృతిచెందగా మరో నలుగురు గాయపడ్డారు.

సంబంధిత పోస్ట్