ప్రేమ పెళ్లి వ్యవహారంలో యువకుడు పై దాడి

12546చూసినవారు
కూతురు ప్రేమ వివాహం చేసుకుంద‌ని యువకుడిపై కత్తితో దాడి చేసిన సంఘటన శనివారం రాత్రి ఆగిరిపల్లి మండలం సీతారాంపురం లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కందుల వంశీ, శ్రావణి వివాహం చేసుకున్నారు. వ్యవహారం తెలుసుకున్న వంశీ ఇంటిపై కత్తులు, కర్రలతో శ్రావణి తండ్రి దాడి చేసినట్లుగా తెలుస్తోంది. దాడిలో యువకుడు వంశీ గాయాల పాలయ్యాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

ట్యాగ్స్ :