నియోజకవర్గంలో చెరువుల అభివృద్ధికి చర్యలు

69చూసినవారు
నూజివీడు నియోజకవర్గంలోని అన్ని చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఆదివారం నూజివీడు పట్టణంలోని వరద బాధితుల సహాయక చర్యలను ఆయన పరిశీలించారు. చెరువుల్లో నీటి నిల్వ చేసేందుకు పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందన్నారు. తద్వారా చెరువుల కింద పొలాల్లో ఆయకట్టుకు పుష్కలంగా నీరందనుందని వివరించారు.

సంబంధిత పోస్ట్