వర్షాలకు ఎవరు ఇంట్లో నుండి బయటకు రావద్దు

70చూసినవారు
భారీ వర్షాలు కురుస్తున్నందున ఇంట్లో నుండి ప్రజలు ఎవరు బయటకు రావద్దని నూజివీడు ఆర్డీవో వై. భవాని శంకరి అన్నారు. నూజివీడు పట్టణంలో వరద బాధితుల ప్రాంతాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆమె మాట్లాడుతూ నూజివీడులో ఎవరు బయటకు ప్రయాణం చేయవద్దని హెచ్చరించారు. ముసునూరు మండలంలోని తమ్మిలేరు పరివాహ ప్రాంతం వైపు ఎవరు వెళ్లొద్దని అన్నారు. వరద బాధితులకు సహాయక చర్యలు చేపడుతున్నట్లుగా తెలిపారు.

సంబంధిత పోస్ట్