రోడ్లు సరి అవ్వగానే ఆర్టీసీ బస్సులు

56చూసినవారు
నూజివీడు డిపో పరిధిలోని గ్రామాలకు ఆర్టీసీ బస్సులు పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఏలూరు ఆర్టీసీ ఆర్ఎం వరప్రసాద్ తెలిపారు. ఆదివారం నూజివీడు ఆర్టీసీ డిపోలో ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడ, విసన్నపేట, ఏలూరు, మైలవరం ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులకు రోడ్లు సరిగా లేక బస్సులు నిలిపివేసినట్లుగా తెలిపారు. రోడ్లపై వరద నీరు తొలగిపోయాక వెంటనే బస్సులు పంపించడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్