స్వయంగా వరి విత్తనాలు వెదజల్లిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

52చూసినవారు
పెడన పట్టణం గూడూరులో వ్యవసాయ అధికారులతో కలిసి గురువారం నాడు గ్రామ రైతు డొక్కా గోవిందరాజులు పొలంలో వరి విత్తనాలు వెదజల్లే పద్ధతి పరిశీలించి, కలెక్టర్ స్వయంగా వరి విత్తనాలు వెదజల్లారు. అనంతరం రామరాజుపాలెం కాలువ ప్రక్క పొలాల్లో రైతులు వేసిన వరి నారుమడి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తొలకరి సాగు సీజన్ ప్రారంభమైందని, రైతులకు సంక్షేమ పథకాల కింద అందవలసిన సాయం రైతులకు అందేలా చూస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్