సీఎం తో కలసి పర్యటించిన ఎమ్మెల్యే వసంత

69చూసినవారు
విజయవాడ భవానీపురం చర్చి నగర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మళ్లీ క్షేత్రస్థాయిలో పర్యటించి నిరాశ్రయులైన బాధిత ప్రజలకు నేనున్నానంటూ భరోసా కల్పించారు. భవానీపురం వద్ద కృష్ణమ్మ వరద ఉధృతిని పరిస్థితిని ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. నదీ ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్