బొండా ఉమా కార్యాలయానికి టీడీపీ శ్రేణులు

66చూసినవారు
విజయవాడ బొండా ఉమా సెంట్రల్ కార్యాలయానికి శుక్రవారం టీడీపీ అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు. టీడీపీ కార్యాలయానికి షాడో టీమ్ కూడా చేరుకున్నట్లు సమాచారం. అరెస్టు చేస్తున్నారనే అనుమానంతో భారీగా అభిమానులు చేరుకున్నారు. సీఎంపై దాడి కేసులో బొండా ఉమా పాత్రపై వైసీపీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేశాయి. ఈ కేసులో బొండా ఉమాను ఇరికించే యత్నం చేస్తున్నారంటూ టీడీపీ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.