తెదేపా ప్రవేశ పెట్టిన మేనిఫెస్టో జనరంజకంగా ఉందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి పేర్కొన్నారు. ఆలూరులోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెదేపా కూటమి ప్రవేశ పెట్టిన మేనిఫెస్టో అన్ని వర్గాల వారికి ఉపయోగకరంగా ఉందన్నారు. ఆలూరు నియోజకవర్గంలో తాగు, సాగు నీరు, అభివృద్ధి జరగాలంటే వీరభద్రగౌడును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన తెలియజేశారు.