
హులేబీడు: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
ఆలూరు మండలం హులేబీడు గ్రామం సమీపంలో హైవే 167 పై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆనంద్ (19) అక్కడికక్కడే మృతి చెందాడు. పల్సర్ బైకుపై వెళ్తున్న ముగ్గురు యువకులు వేగంగా వస్తున్న కారును ఢీ కొట్టారు. ఘటనలో పూర్ణ, తిమ్మప్ప అనే యువకులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆదోనికి తరలించారు. ఆలూరు ఎస్సై మహబూబ్ బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆనంద్ కుటుంబంలో విషాదం నెలకొంది.