దేవనబండలో హోరాహోరీగా కబడ్డీ పోటీలు

1088చూసినవారు
దేవనబండలో హోరాహోరీగా కబడ్డీ పోటీలు
పత్తికొండ మండల పరిధిలోని దేవనబండ గ్రామంలో శ్రీ దస్తగిరి స్వాముల వారి ఉరుసు ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు సోమవారం హోరహోరిగా జరిగాయి. కబడ్డీ పోటీలలో విజేతగా దేగులపాడు గ్రామం జట్టు నిలిచింది. 2వ స్థానంలో దేవనబండ గ్రామం జట్టు, మూడో స్థానంలో చందోలి గ్రామం జట్టు నిలిచాయి. దర్గా పీఠాధిపతి సయ్యద్ ఏజాస్ షరీఫ్ ఖాద్రి విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. దర్గా కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్