ప్లాస్టిక్ వాడకం నిషేధం: కమీషనర్

71చూసినవారు
ప్లాస్టిక్ వాడకం నిషేధం: కమీషనర్
ప్లాస్టిక్ వాడకం నిషేధమని, నిబంధన అతిక్రమించి విక్రయించిన వారిపై కేసులు నమోదు చేయిస్తామని ఆదోని మున్సిపల్ కమిషనర్ కృష్ణ తెలిపారు. శనివారం రామజల చెరువు వద్ద స్వచ్ఛత హి సేవలో భాగంగా పిచ్చి మొక్కలు తొలగించారు. వచ్చే నెల 2వ తేదీ గాంధీ జయంతి వరకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తామన్నారు. చెత్తా చెదారాన్ని మురుగు కాలువలో వేయకుండా డస్ట్ బిన్లను ఉపయోగించి, పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలన్నారు.

సంబంధిత పోస్ట్