ఆదోని పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలో క్రొత్తగా నిర్మించిన శౌచాలయ కంటైనరును ఎమ్మెల్యే పార్థసారథి, మున్సిపల్ కమిషనర్ రామచంద్రా రెడ్డి ఉపయోగంలో తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు దిలీప్ ఢోకా కోరారు. శనివారం తాళం వేసిన శౌచాలయం కంటైనర్ను పరిశీలించారు. ప్రజా అంశంపై ఎమ్మెల్యే సమీక్షిస్తున్న తీరుపై కాంగ్రెస్ హర్షం వ్యక్తం చేస్తోందన్నారు. అభివృద్ధికి సహకరిస్తామన్నారు.