అహోబిలంలో ఘనంగా పంచపర్వ ఏకాదశి పర్వదినం వేడుకలు

59చూసినవారు
అహోబిలంలో ఘనంగా పంచపర్వ ఏకాదశి పర్వదినం వేడుకలు
ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన అహోబిలంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. దిగువ అహోబిలంలోని శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారికి, శ్రీ అమృతవల్లి అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు కీడాంబి వేణుగోపాల్ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచపర్వ ఉత్సవాలలో భాగంగా ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి అమ్మవారికి అభిషేకము, తులసి మాలలతో అలంకరించి విశేష పూజలను నిర్వహించారు.

సంబంధిత పోస్ట్