TDP రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యవర్గ కార్యదర్శిపై దాడి (వీడియో)

54చూసినవారు
అన్నమయ్య జిల్లా రాజంపేటలోని మన్నూరు అరుంధతి వాడలో టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యవర్గ కార్యదర్శి మందా శ్రీను, ఆయన కుటుంబంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో మందా శ్రీను, ఆయన భార్య పార్వతీ, పిల్లలు గాయపడ్డారు. పాతకక్షల నేపథ్యంలో తనపై దాడి చేశారని మందా శ్రీను వెల్లడించారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. గాయపడిన మందా శ్రీను కుటుంబం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్