ఆళ్లగడ్డలో జర్నలిస్టులు మంగళవారం రెండో రోజు కూడా తమ నిరసన తెలియజేశారు.మహానంది వార్తా విలేకరి మధు పై దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఏపీయూడబ్ల్యూజేఎఫ్ నాయకులు , టౌన్ సిఐ రమేష్ బాబుకు వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముల్లా నిజాముద్దీన్, , శ్రీనివాసరావు పాల్గొన్నారు.