ఆళ్లగడ్డ పట్టణ శివార్లలో ఉన్న శోభ ఘాట్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే సడన్ గా హైవే పైకి వచ్చిన ఓ లారీని హైదరాబాద్ నుండి కడపకు వెళ్తున్న ఆల్విన్ వాహనం ఢీకొంది. ఈప్రమాదంలో ఆల్విన్ డ్రైవర్ పెద్ద అంకాలు అక్కడిక్కడే మృతి చెందాడు. మరో డ్రైవర్ రమేష్ కు గాయాలు అయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్ఐ వెంకటరెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.