మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దకడబూరు మండలం దొడ్డిమేకల గ్రామంలో శనివారం ఉదయం 6: 30 గంటలకు గ్రామంలోని ప్రధాన వీధిలో చంద్రమౌలేశ్వరస్వామి ప్రభోత్సవం ఘనంగా సాగింది. అర్చకులు, ఉత్సవమూర్తులను పల్లకిలో తీసుకొచ్చి ప్రభపై కొలువు దీర్చారు. శివ నామస్మరణలు, మంగళవాయిద్యాలు, బాలికల కోలాటాల నడుమ స్వామి ప్రభోత్సవం శోభాయ మానంగా సాగింది. శివరామరెడ్డి, గజేంద్ర రెడ్డి, సర్పంచ్ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.